ఆంధ్రప్రదేశ్‌

ఏడుగురు ఏఎస్పీలు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 19: రాష్ట్రంలో ఏడుగురు అదనపు ఎస్‌పీలను బదిలీ చేస్తూ సోమవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీచేశారు. వెయింటింగ్‌లో ఉన్న అడిషనల్ ఎస్‌పీ ఎం వెంకటేశ్వర్లును గుంటూరు అర్బన్ క్రైంకు బదిలీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అడ్మిన్ అడిషనల్ ఎస్‌పీగా పనిచేస్తున్న కే ఈశ్వరరావును గుంటూరు అర్బన్ లా అండ్ ఆర్డర్‌కు, విజయవాడ నగర ఎస్‌బీ విభాగంలో పనిచేస్తున్న షేక్ నవాబ్ జాన్‌ను పశ్చిమ గోదావరి జిల్లా అడ్మిన్‌కు, గుంటూరు అర్బన్ అడ్మిన్‌లో పనిచేస్తున్న వైటీ నాయుడిని పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే వెయిటింగ్‌లో ఉన్న టీ హరికృష్ణను విశాఖపట్నం ఏపీ ఎస్‌పీడీసీఎల్ సీవీఓగానూ, ఎన్ సదాశివరావును విజయనగరం జిల్లా అడ్మిన్‌కు, కె లావణ్య లక్ష్మిని తిరుపతి ఎపీ ఎస్‌పీడీసీఎల్ సీవీఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.