ఆంధ్రప్రదేశ్‌

ఎవరి పనితీరు ఏమిటో ప్రజలకు తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 19: కష్ట సమయాల్లో ఎవరి పనితనం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరి పనితీరు ఎంటో ప్రజలు తేల్చుకుంటారు విజయసాయిరెడ్డీ.. అంటూ సోమవారం ట్విట్టర్‌లో వెంకన్న వ్యాఖ్యానించారు. మీ మంత్రులు ఎమ్మెల్యేలు వరద బాధితులను ఆదుకోవడంలో చాలా కష్టపడి, చెమటోడ్చి సహాయం చేసి, బాధితులనే కినే్ల వాటర్ బాటిల్స్ అడిగి చివాట్లు తింటున్నారన్నారు. ముందు అర్జెంట్‌గా వెళ్లి మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కినే్ల వాటర్ బాటిల్స్ అందించండి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ వీటికి భయపడి అమెరికా పర్యటనకు వెళ్లలేదు కదా.. అంటూ వెంకన్న ఎద్దేవా చేశారు.