ఆంధ్రప్రదేశ్‌

ఒకే కాన్పులో ముగ్గురు జననం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఆగస్టు 19: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని రోహిణి ఆసుపత్రిలో ఒక మహిళ సోమవారం ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. తల్లీ పిల్లలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన పత్సమట్ల సాయిలక్ష్మికి నెలలు నిండి, కాన్పు సమయం దగ్గర పడటంతో ఆమె భర్త వెంకట సోమరాజు అమలాపురంలోని రోహిణీ ఆసుపత్రికి శనివారం తీసుకొచ్చారు. సాయిలక్ష్మిని డాక్టర్లు పరిశీలించి వైద్య సేవలు అందించగా సోమవారం ఆమె ముగ్గురు శిశువులకు జన్మనిచ్చినట్టు వైద్యులు తెలిపారు. వీరిలో ఇద్దరు మగ శిశువులు కాగా ఒకరు ఆడశిశు. మగబిడ్డలు ఇద్దరిలో ఒకరు రెండు కిలోలు, మరొకరు 1.9 కిలోలు బరువు ఉండగా ఆడ శిశువు 1.56 కిలోల బరువు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న అమలాపురం సీడీపీవో జే విమల ఆసుపత్రికి వెళ్ళి సాయిలక్ష్మిని, శిశువులను పరిశీలించి వివరాలు సేకరించారు.
చిత్రం...అమలాపురంలో ఒకే కాన్పులో జన్మించిన ముగ్గురు శిశువులు