ఆంధ్రప్రదేశ్‌

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 20: కామంతో కళ్లుమూసుకుపోయి విచక్షణ, వావీ వరుస లేకుండా ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జగపతినగరంలో అదే గ్రామానికి చెందిన యాభై సంవత్సరాల చదరం జోగేశ్వరరావు వరుసకు కుమార్తె అయ్యే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జోగేశ్వరరావు ఇంటి ఎదురుగా ఈ చిన్నారి ఇల్లు ఉంది. అంగన్‌వాడీ కేంద్రంలో ఈ చిన్నారి చదువుకుంటోంది. రోజూ జోగేశ్వరరావు ఇంటి ఆవరణలో ఆడుకునేందుకు వెళుతూ ఉండేది. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఆడుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారిని చాక్లెట్లు ఇస్తాను రమ్మని గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లిన పాప గట్టిగా ఏడుస్తుండడంతో కడుపునొప్పిగా భావించి తల్లిదండ్రులు ప్రత్తిపాడులోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు తీసుకువెళ్లారు. రక్తస్రావం ఎక్కువగా అవడంతో కాకినాడ తరలించారు. జోగేశ్వరరావును అరెస్టుచేశారు. కిర్లంపూడి పోలీసు లు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.