ఆంధ్రప్రదేశ్
పట్టిసం నుంచి గోదావరి నీరు తరలింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 21 August 2016
పోలవరం, ఆగస్టు 20: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి 12 మోటార్లు ఆన్చేసి కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు. శుక్రవారం వరకూ 11 మోటార్లు ఆన్చేసి నీటిని తరలిస్తుండగా, మరో మోటార్ను శనివారం ఆన్చేసి రోజుకు 4250 క్యూసెక్కుల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ వరకూ 12 మోటార్ల ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించేవారు. అయితే కృష్ణా జిల్లాలోని కుడి కాలువ వద్దనున్న అండర్ టనె్నల్కు గండి పడడంతో మోటార్లను నిలిపివేసిన విషయం విధితమే. గండిని పూడ్చివేసి ఈ నెల 9న రెండు మోటార్లు ఆన్చేశారు. ఆ తర్వాత ఒక్కో మోటారు పెంచుతూ ప్రస్తుతం 12 మోటార్ల ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్నారు.