రాష్ట్రీయం

అమరావతిపై పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: అమరావతిలో సీడ్ క్యాపిటల్‌ను పిపిపి పద్ధతిలో నిర్మించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది. ఆదిత్య హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో స్విస్ ఛాలెంజ్ విధానం సరికాదని పేర్కొంది. పిటీషన్‌ను జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు మంగళవారం నాడు విచారించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం నాడు న్యాయస్థానంలో జరిగిన విచారణలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని బహిర్గతం చేయడం సాధ్యం కాదని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.