ఆంధ్రప్రదేశ్
పడవ ప్రమాదం.. హృదయ విదారకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 September 2019
విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 15: గోదావరిలో పడవ బోల్తాపడి పర్యాటకుల మృతి చెందడం హృదయ విదారకమైన ఘటన అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పడవ ప్రమాద ఘటన సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురైయినట్లు ఆదివారం తెలిపారు. విహార యాత్ర విషాద యాత్రగా మారడం దురదృష్టకమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గల్లంతైన వారంతా క్షేమంగా ఒడ్డుకు చేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గల్లంతైన వారికోసం జరుగుతున్న సహాయక చర్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని లోకేష్ పిలుపునిచ్చారు.
*చిత్రం... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్