ఆంధ్రప్రదేశ్
భోజన పథకం కుక్-హెల్పర్లకు ఆగస్టు నుంచి గౌరవ వేతనం పెంపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 September 2019
విజయవాడ: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం కింద వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న కుక్ కమ్ హెల్పర్లకు గౌరవ వేతనాన్ని ఆగస్టు నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో వీరు 88,296 మంది ఉన్నారు. వీరికి గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి 3వేల రూపాయలకు పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 12న గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయినప్పటికీ ఆ మేరకు చెల్లింపులు చేయలేదు. దీనిపై దృష్టి సారించిన విద్యాశాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దుచేస్తూ ఆదివారం మరో ఉత్తర్వును జారీ చేసింది. గౌరవ వేతనాన్ని ఆగస్టు నుంచి వర్తింపజేస్తూ సెప్టెంబర్ 1న చెల్లించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.