ఆంధ్రప్రదేశ్‌

కోడెలకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 18: నవ్యాంధ్ర ప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్, మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు పల్నాడు కన్నీటి వీడ్కోలు పలికింది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని స్వర్గపురిలో డాక్టర్ కోడెల అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిశాయి. జిల్లాతో పాటు రాష్టవ్య్రాప్తంగా తరలివచ్చిన కోడెల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల నడుమ పల్నాటి పులికి ఘనమైన అంతిమ వీడ్కోలు లభించింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నర్సరావుపేటలోని కోడెల స్వగృహం కోట నుండి బయలుదేరిన అంతిమ యాత్ర సత్తెనపల్లి రోడ్డు, బరంపేట, పల్నాడు బస్టాండ్, శివుడు బొమ్మ సెంటర్, మల్లమ్మ సెంటర్ మీదుగా గుంటూరు రోడ్డులోని స్వర్గపురికి సాగింది. యాత్ర పొడవునా ఆయన అభిమానులు, కార్యకర్తలు బరువైన గుండెలతో జోహార్లర్పిస్తూ సాగారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టిడిఎల్‌పి ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని తదితర పార్టీ ముఖ్య నేతలు అంతిమయాత్ర ఆద్యంతం కోడెల పార్థివదేహం వెంట నడిచారు. నర్సరావుపేటలోని మల్లమ్మ సెంటర్ వద్దకు వచ్చిన అంతిమ యాత్ర స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం మీదుగా వెళ్లేందుకు పోలీసులు శాంతిభద్రతల నేపథ్యంలో అనుమతించలేదు. ఈ దశలో కార్యకర్తలు,
పోలీసులకు మధ్య కొద్దిపాటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యనేతలు కలగజేసుకుని పోలీసులు సూచించిన ప్రాంతాల మీదుగా స్వర్గపురికి కోడెల భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. స్వర్గపురి వద్ద కోడెల తనయుడు కోడెల శివరామ్ దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహిస్తామని నిర్ణయించినప్పటికీ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు అందుకు అంగీకరించలేదు.
గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్ నుండి మంగళవారం అర్ధరాత్రి దాటాక నర్సరావుపేటలోని కోడెల స్వగృహం కోటకు భౌతికకాయాన్ని వాహనంలో పార్టీ నేతలు తరలించారు. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కోడెల అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్ధం పార్ధివ శరీరాన్ని ఉంచారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ముఖ్య నేతలు కోడెల గృహానికి వెళ్లి భార్య, కుమారుడు, కుమార్తెతోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాడ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంలో కోడెల భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

*చిత్రం... అశేష జనవాహిని మధ్య సాగిన కోడెల అంతిమయాత్ర