ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో వేడుకగా బ్యాక్ సవారీ ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో బుధవారం సాయంత్రం బ్యాక్ సవారి (బాగ్ సవారీ)ఉత్సవాన్ని టీటీడీ వేడుకగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులను తిరుమాడ వీధులలో ఊరేగుతూ అనంతాళ్వారు తోటకు వేంచేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు తిరుమలలో భాగ్‌సవారి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా భాగ్ సవారి ఉత్సవాన్ని నిర్వహించారు. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారు భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటలు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలుకోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారుల వారు అశ్వత్త వృక్షానికి బందిస్తాడు. స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారుల వారు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది స్వామివారేనని గ్రహించి పశ్చాతాప పడ్డాడు. వెంటనే అమ్మవారిని బంధ విముక్తిరాలిని చేసి, పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తుడైన అనంతాళ్వారు భక్తిమెచ్చి స్వామివారు బ్రహ్మోత్సవాల మరునాడు అనంతాళ్వారు తోటలోనికి అప్రదణ్రంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. బాగ్ సవారీ ఉత్సవంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, వీ ఎస్వీ మనోహర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... తిరుమల మాడ వీధుల్లో బుధవారం స్వామివారికి బ్యాక్ సవారీ నిర్వహిస్తున్న టీటీడీ