ఆంధ్రప్రదేశ్‌

అహోబిలంలో అన్నదాన భవన నిర్మాణానికి గంగుల రూ. 2 కోట్లు విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, అక్టోబర్ 18: ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో నిర్మించ తలపెట్టిన అన్నదాన భవనానికి గంగుల సుభాష్‌రెడ్డి శుక్రవారం రూ. 2 కోట్లు విరాళం ప్రకటించారు. అహోబిల మఠంలో ఉన్న 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిని శుక్రవారం సుభాష్‌రెడ్డి దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం పీఠాధిపతి సమక్షంలోనే అన్నదాన భవన నిర్మాణానికి అయ్యే రూ. 2 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అన్నదాన భవన నిర్మాణం చేపట్టేందుకు రూ. 2 కోట్లు విరాళంగా ప్రకటించామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన దిగువ ఆలయంలో కొలువుదీరిన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. సుభాష్‌రెడ్డిని అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి నరసింహస్వామి శేషవస్త్రం, పూలమాలతో సత్కరించారు.