ఆంధ్రప్రదేశ్‌

జాతీయ రహదారులపై మద్యం దుకాణాల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై శుక్రవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదార్లపై మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. గతంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో రాష్ట్రంలోని కొన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను డీనోటిఫై చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈవిషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై జగన్మోహన్‌రెడ్డి స్పందిస్తూ, డీనోటిఫై చేసిన వాటిని తిరిగి రాష్ట్ర, జాతీయ రహదారులుగా ప్రకటించాలని ఆదేశించారు. ఈమేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.