ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన అష్టోత్తర శతకుండాత్మక మహాయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 18: తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గత రెండు రోజులుగా జరుగుతున్న అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు ప్రధాన కంకణభట్టార్ శ్రీ సీతారామాచార్యుల ఆధ్వర్యంలో కుంభరాధన, గజపూజ, ఉక్తహోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతితో మహాయాగం ముగిసింది. తరువాత అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛరణలతో కుంభంలోని స్వామివారి శక్తిని మూలవిరాట్టులోనికి ఆవహనం చేశారు. ఈ మహాయాగంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వేదపండితులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి వైభవాన్ని నలుదిశల వ్యాప్తి చేయడానికి శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2010లో టీటీడీ ఈ యాగం నిర్వహించగా, తిరిగి ఈ ఏడాది 2019 అక్టోబర్ 16 నుండి 18వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ యాగం ద్వారా దేశం, రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వర్షాలు కురిసి, సంవృద్ధిగా పంటలు పండి సుఖసంతోషాలతో ఉండాలని ఈ యాగం ఉద్దేశ్యం. అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంలో భాగంగా ఆలయంలోని ఏడు ప్రధాన హోమగుండాలతో పాటు, 108 హోమగుండాలు ఏర్పాటుచేసి, వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది ప్రముఖ రుత్వికులతో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, వైఖానస ఆగమ సలహాదారులు సుందరవరద భట్టాచార్యులు, మెహన రంగాచార్యులు, అనంతశయన దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈవో యల్లప్ప, ఏఈవో ధనంజయులు, ఆలయ ప్రధానార్చకులు బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్‌రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అనిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.