ఆంధ్రప్రదేశ్‌

కార్మిక పక్షపాతి సీఎం జగన్: గౌతంరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 19: నిరుద్యోగుల జీవితాల్లో వెలుగురేఖలు నింపేందుకు ఓట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామకాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పీ గౌతంరెడ్డి తెలిపారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంపెనీ చట్టంలోని సెక్షన్ 8 కింద కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రత్యేక కార్పొరేషన్ కోసం జీవో నెంబర్ 126 జారీచేశారని, దీంతో సీఎం జనరంజక పాలనపై కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను 16 వేల రూపాయలకు పెంచుతూ మరో జీవో తీసుకువచ్చారని, మున్సిపాలిటీలలో పనిచేసే కార్మికుల జీతాలను 18 వేలకు పెంచారని తెలిపారు.