ఆంధ్రప్రదేశ్‌

ఆహారశుద్ధికి 21 యూనిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆహార శుద్ధి రంగంలో 21 ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఎంపవర్ కమిటీ (ఎస్‌ఎల్‌ఈసీ) సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 21 ఆహార శుద్ధి పరిశ్రమల యూనిట్లకు నిధుల మంజూరు, పరిశ్రమల స్థాపనకు అనుమతినిస్తూ తీర్మానించారు.
వాటిలో ముఖ్యంగా నూతన ఆహారశుద్ధికి సంబంధించిన 15 యూనిట్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఓ యూనిట్, ష్రింప్ ప్రాసెసింగ్‌లో కోల్డ్‌చైన్‌కు మరో రెండు యూనిట్లు, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌కు చెందిన రెండు యూనిట్లు, ఓ మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కృష్ణాజిల్లాలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్, ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్, చిత్తూరు జిల్లాలో కోల్డ్‌ప్రెస్డ్ ఫ్రెష్ జ్యూస్ బాటిలింగ్ యూనిట్, ఫ్రూట్ పల్ప్ మాన్యుఫ్యాక్చరింగ్, జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు, తూర్పుగోదావరి జిల్లాలో పోర్టిఫైడ్ రైస్ ప్రాసెసింగ్, పామాయిల్ రిఫైనరీ, గుంటూరు జిల్లాలో హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్స్ ఆగ్రో కమోడిటీస్, స్పైస్ ప్రాసెసింగ్, మెంథాల్ అలైడ్ ప్రాజెక్ట్, కడప జిల్లాలో పీనట్ ప్రాసెసింగ్, విశాఖ జిల్లాలో జీడిపిక్కల ప్రాసెసింగ్, కర్నూలు జిల్లాలో బొప్పాయి ప్రాసెసింగ్, విజయనగరం జిల్లాలో బేకరీ యూనిట్ తదితర ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ఆమోదం లభించింది.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రామేశ్వరంపేట వద్ద రూ. 1679 కోట్ల వ్యయంతో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర స్థాయి ఎంపవర్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆహార శుద్ధి పరిశ్రమలను కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆమోదించిన యూనిట్లను సకాలంలో నెలకొల్పి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర స్థాయి నైపుణ్య శిక్షణ సంస్థతో సమన్వయం చేసుకుని అవసరమైన శిక్షణను అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ కార్యదర్శి కాంతీలాల్ దండే, వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ సీఈఓ ఎల్ శ్రీ్ధర్‌రెడ్డి వివిధ సంస్థల అధికారులు పాల్గొన్నారు.