ఆంధ్రప్రదేశ్‌

1నేరాష్ట్రావతరణ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 21: నవంబర్ ఒకటిన రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ వేడుకల ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్టస్థ్రాయిలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంతో పాటు జిల్లా కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రం నుండి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారిని, అవతరణకు త్యాగాలు అందించిన వారిని సత్కరించే రీతిలో వేడుకలు జరుపుతామన్నారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
స్వాతంత్రోద్యమం, రాష్ట్ర అవతరణకు కృషిచేసిన ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులను సన్మానించటంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు భాష, సంస్కృతికి విశేష సేవలందించిన వారికి, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందించేందుకు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల ఎంపికకు సబ్ కమిటీని, అవార్డుల జాబితా ఎంపికకు మరో ఉప కమిటీని ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఖరారు చేయాలని వివరించారు. రాష్ట్రావతరణ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్చు చేయాలని, దీనిపై కలెక్టర్లకు తగిన మార్గదర్శకాలు జారీచేయాలని సూచించారు. ప్రముఖ హోటళ్ల సహకారంతో తెలుగు వంటకాలపై ప్రత్యేక ప్రదర్శన శాలలు ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారులు, అధికారులతో ఈ సందర్భంగా సీఎస్ సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం, సలహాదారులు జీవీడీ కృష్ణమోహన్, సజ్జల రామకృష్ణారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి మన్మోహన్ సింగ్, ముఖ్య కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, గోపాలకృష్ణ ద్వివేది, ఎస్‌ఎస్ రావత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయకుమార్‌రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...రాష్ట్రావతరణ ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం