ఆంధ్రప్రదేశ్
ఎడారిని తలపిస్తున్న అమరావతి: లోకేష్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 October 2019
విజయవాడ: ఏదైనా ఊరిని దుష్టశక్తి అవహించినప్పుడు చెట్లు మాడిపోవడం, ప్రజలు ఎక్కడికక్కడ వదిలేసి వెళ్లిపోవడం కథల్లో వింటుంటామని, ప్రస్తుతం అమరావతి విషయంలో కూడా అదే జరిగిందేమోనని అనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడక్కడ చూస్తే ఎడారిని తలపిస్తోందని మంగళవారం ట్విట్టర్లో లోకేష్ పేర్కొన్నారు. జగన్ పార్టీ డమీలకు కూడా రాజధాని గురించి ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలీక రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు.