ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్‌ను కలిసిన రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్షమాపణ లేఖ ఇచ్చినందున తనను అసెంబ్లీ ఆవరణలోని వైసీపీఎల్పీ కార్యాలయానికి అనుమతించాలని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావును అభ్యర్థించినట్లు సమాచారం. ఆమె మంగళవారం స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తనను అసెంబ్లీలోకి అనుమతించకపోయినా వైసీపీఎల్పీ కార్యాలయానికి అనుమతించాలని ఆమె కోరారు. అయితే, ఇది తానొక్కడినే తీసుకునే నిర్ణయం కాదని, బీఏసీ, సభలో నిర్ణయిస్తారని స్పీకర్ చెప్పినట్లు తెలిసింది.
ఇదిలాఉండగా, రోజా క్షమాపణ లేఖపై అసెంబ్లీ చివరిరోజు సభలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెదేపా వర్గాలు చెబుతున్నాయి. సభ తొలిరోజు కంటే చివరిరోజు చర్చించి, వచ్చే సమావేశాల నుంచి ఆమెను అనుమతిస్తే బాగుంటుందని పలువురు ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వానికి సూచించినట్లు తెలిసింది.
కాగా, రెండురోజల పాటు సాయంత్రం కూడా సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కృష్ణా పుష్కరాలు, రెయిన్‌గన్లతో పంటలను కాపాడిన వైనం, ఇతర అంశాలను సభలో చర్చించాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు వివరించారు.