ఆంధ్రప్రదేశ్‌

హోదాకు మించిన సాయం: కంభంపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగిన భారతీయ జనతాపార్టీ పోటీకి సిద్ధంగా ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. విశాఖలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి తమ కేడర్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. పొత్తు అంశం అధిష్ఠానం ఆలోచిస్తుందన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలను ప్రకటించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమని, వారు చొరవ చూపాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉందని, అయితే సాంకేతిక కారణాల నేపథ్యంలో హోదాకు మించి సాయంపై కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. విభజన నేపథ్యంలో ఎపి ఆర్థిక లోటును భర్తీ చేయాలని 14వ ఆర్థిక సంఘం నిర్ణయించిందని, దీనిలో భాగంగా 2014-15 ఆర్థిక సంవత్సరాని గాను ఇప్పటికే రూ.4000 కోట్లు కేంద్రం మంజూరు చేసిందన్నారు.