ఆంధ్రప్రదేశ్
పొత్తూరికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 26 March 2016
విశాఖపట్నం, మార్చి 25: పత్రికా రంగంలో విశేష సేవలందించే వారికిచ్చే గంటా చిన రోశయ్య, నారాయణమ్మ స్మారక అవార్డుకు ప్రఖ్యాత సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర రావు ఎంపికయ్యారు. పత్రికారంగానికి ఎనలేని సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వర రావును 2015 సంవత్సరానికి ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేసినట్టు కన్వీనర్, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో శుక్రవారం వెల్లడించారు. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదును అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే మరో నాలుగు ప్రత్యేక జ్యూరీ అవార్డులను కమిటీ ఎంపిక చేసిందన్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 8న విశాఖ ఎయు ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పొత్తూరికి అవార్డును అందజేయనున్నట్టు తెలిపారు.