ఆంధ్రప్రదేశ్
ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి: సీపీఎం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 November 2019
విజయవాడ, నవంబర్ 8: వెలుగు పథకంలో వీఓఏలుగా 3 సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, వారికి ఉపాధి భద్రత కల్పించాని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో 27వేల మందికి పైగా వీఓఏలు గత 18 సంవత్సరాల నుండి గ్రామ సమాఖ్యల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోను గత ప్రభుత్వ హయాంలో కూడా వీఓఏల ఉద్యోగాలకు భద్రత లేక అనేక ఆందోళనలు చేశారన్నారు.