ఆంధ్రప్రదేశ్‌

20 నుంచి కొత్త రేషన్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఈ నెల 20 నుంచి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. 20 నుంచి వచ్చే నెల 20 వరకు ఎంపికకు సంబంధించిన కొత్త కార్డులు జారీ చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ఎంపిక నిర్వహించాలని, వైఎస్సార్ జీరో వడ్డీ, నేతన్న నేస్తం, అమ్మఒడి, నారుూ బ్రాహ్మణులకు నగదు, వైఎస్సార్ కాపు నేస్తం, గ్రామాల్లో దేవాలయాలు, మసీదులు, చర్చిలతో సహా ఇతర పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు జారీచేశారు. గ్రామ సచివాలయాల్లో శాశ్వత డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. వివిధ పథకాలకు అర్హులైన వారి జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని వివరించారు. అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేయాలనే సమాచారాన్ని అందులో పొందుపరచాలని సూచించారు.