ఆంధ్రప్రదేశ్‌

‘జగన్ ఏ వర్గానికి కొమ్ముకాస్తున్నారో అందరికీ తెలుసు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 12: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఏ వర్గానికి కొమ్ము కాస్తున్నారో, ఎవరిని ఎక్కువగా ఆదరిస్తారో రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడని తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఓ వర్గానికి అమితానందం కలిగించిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రప్రభుత్వం ఎవరికి కొమ్ముకాస్తుందో స్పష్టం చేశాయన్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని సామాజికవర్గాలకు సమన్యాయం చేస్తే, రాజశేఖరరెడ్డి, ఆయన వారసుడు జగన్మోహనరెడ్డి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారో, ఇస్తున్నారో వారి నిర్ణయాలను బట్టే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తూతూ మంత్రంగా పదవులు కొన్ని వర్గాలకు ఇచ్చినా, అసలు సిసలు అధికారం చెలాయించేదెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. రాజ్యాంగ హోదాలో ఉన్నానని ఒప్పుకుంటూనే, ప్రజాప్రతినిధిగా మాట్లాడుతున్నానని చెప్పిన స్పీకర్ తమ్మినేని సీతారాం అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.