ఆంధ్రప్రదేశ్‌

హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం: మాజీ ఎమ్మెల్యే బోండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 12: వైసీపీ ప్రభుత్వ ప్రోద్బలంతోనే హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందని, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా పవిత్రమైన క్షేత్రంగా పేరు ప్రఖ్యాతలు పొందిన తిరుమలలో అన్యమతానికి చెందిన వారిని వివిధ విభాగాల కింద ప్రభుత్వం ఉద్యోగులుగా నియమిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించినట్లుగానే హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం విచ్చలవిడిగా జరిగేలా ప్రభుత్వమే ప్రోత్సహించడం బాధాకరమన్నారు. కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామి విషయంలో వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, కొండపైన పనిచేసే ఉద్యోగులుగా, రోజువారీ కూలీలుగా అన్యమతస్థులను నియమిస్తున్నారని ఉమా మండిపడ్డారు.