ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ భూముల అమ్మకం తగదు: సీఎంకు సీపీఐ లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: ప్రభుత్వ స్థలాలు, అతిథి గృహాలు అమ్మాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని, కేంద్రం నుండి ఏపీకి రావాల్సిన నిధులు రాబట్టే చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్న పథకాల హామీ అమలు కోసం ఎంతో విలువైన రాష్ట్ర ప్రభుత్వ స్థలాలు, భూములను, అతిథి గృహాలను అమ్మేందుకుగాను బిల్డ్ ఆంధ్రప్రదేశ్ (బిల్డ్ ఏపీ) సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్‌బీసీసీతో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. భూములు అమ్మేసినవరత్నాల అమలుకై వినియోగించేందుకు చేస్తున్న ప్రభుత్వ యోచన సమంజసం కాదన్నారు.