ఆంధ్రప్రదేశ్‌

నిధులు దారి మళ్లించటం అభివృద్ధిని అడ్డుకోవటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 12: ఉపాధి హామీ నిధులను దారి మళ్లించడం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధిహామీ పథకం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కలిపి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామాల్లో జరిగిన 2500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు అవార్డులందుకున్న ప్రభుత్వం, కేంద్రం నుండి విడుదలైన ఉపాధి నిధులను పనులు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలకు ఇవ్వకుండా సొంత పథకాలకు దారి మళ్లించడం దారుణమన్నారు.