ఆంధ్రప్రదేశ్
ఆ ఆందోళనలతో సంబంధం లేదు: ఏపీ జేఏసీ అమరావతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 November 2019
విజయవాడ, నవంబర్ 12: ఏపీ ఎన్జీవోల జేఏసీ చేపట్టిన ఆందోళన కార్యఅకమాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ రీజనల్ టీవీ ఫణి పేర్రాజులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయపై బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన ఇతర విషయాల పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాలని, న్యాయపరమైన సమస్యలు, డిమాండ్స్ గురించి ముందుగా ప్రభుత్వంతో చర్చించి, వాటిపట్ల ప్రభుత్వ వైఖరి తెలుసుకోవాల్సి ఉందన్నారు. కనీస సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే సాంప్రదాయానికి ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి తెర తీశారని ఆరోపించారు.