ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రిపై కార్తీకదీప కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) నవంబర్ 12: శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో భక్తులు వెలిగించిన కోటి దీపాల కాంతుల్లో ఇంద్రకీలాద్రి వెలిగిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సాయంత్రం అమ్మవారి సన్నిధిలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. అమ్మవారి రాజగోపురం, మల్లికార్జున మహామండపం అవరణ, శ్రీకనకదుర్గనగర్, ఘాట్‌రోడ్, అమ్మవారి రాజగోపురం, నటరాజ ఆలయ మండపం, తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు దీపాలు వెలిగించి అమ్మవార్లకు సమర్పించుకున్నారు. సాయంత్రం 7గంటలకు స్వామివారి సన్నిధిలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
*చిత్రం...భక్తులు వెలిగించిన దీపాల కాంతుల్లో ఇంద్రకీలాద్రి