ఆంధ్రప్రదేశ్‌

ఇసుక అక్రమ మైనింగ్‌పై నిఘా ఉంచాలి: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 18: ఏపీ సీఎం జగన్ ఇసుక కొరత అంశంలో చేసిన తప్పు తెలుసుకునేలా చేసిన వారందరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన ఇసుక విధానం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని సోమవారం ట్విట్టర్ వేదికగా పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 35లక్షల మంది ప్రత్యక్షంగానూ, మరోక్షంగా మరో 65 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. అయితే చేసిన తప్పులను ముఖ్యమంత్రి జగన్ తెలుసుకునేలా చేసిన మీడియా, రాజకీయ నేతలు, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. అక్రమ ఇసుక మైనింగ్‌పై జనసైనికులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని సూచించారు. ఇసుక అవినీతిపై జనసేన పోరాటాన్ని ప్రారంభించిందని, జనసైనికులంతా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు.