ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర భవిష్యత్తును అయోమయంలోకి నెట్టారు: కన్నా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 January 2020
విజయవాడ(సిటీ), జనవరి 20: సీఎం జగన్ తన తుగ్లక్ పాలనలో రాష్ట్రం తలకిందులైన తాబేలులా తయారయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బంగారు భవిష్యత్తు ఉన్న ఏపీ రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టిన ఘనత జగన్కే సొంతమని సోమవారం ట్విట్టర్లో కన్నా ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ అంటూ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును తీవ్ర అయోమయంలోనికి నెట్టేశారని మండి పడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కాని, పరిపాలన వికేంద్రీకరణ కాదన్నారు. అమరావతిలో ఇప్పుడున్న నిర్మాణాలకు, వాటాదారులకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నిస్తూ, తలకిందులైన తాబేలు ఫొటోను ట్యాగ్ చేస్తూ వ్యాఖ్యానించారు.