ఆంధ్రప్రదేశ్‌

పడరాని పాట్లు పడుతున్న బాబు అనుకూల మీడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 21: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిలిచేందుకు ఆయన అనుకూల మీడియా పడరాని పాట్లు పడుతోందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇప్పటికీ అమరావతిపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. అమరావతికి వరద ముప్పులేదని, రేగడి నేలలైనా భారీ నిర్మాణాలకు అనుకూలమే అని చెప్పడానికి బాబు మీడియా తెగ ప్రయత్నిస్తోందన్నారు. చివరకు కోల్‌కతా, ముంబై నగరాలు ప్రమాదకరమైనవని తీర్పు చేప్పే సాహసానికి తెగబడ్డాయన్నారు. చంద్రబాబు నక్క అంటే నక్క, కుక్క అంటే కుక్క అనడమే పచ్చ మీడియా పనిగా మారిందని ట్వీట్ చేశారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు, లోకేష్ వారి వ్యాపారం కోసం అన్ని దేశాలు ప్రత్యేక విమానాల్లో విహరించారని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్ కోసం ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్ సదస్సుకు వెళ్లేందుకు చంద్రబాబు, లోకేష్‌లు ప్రత్యేక విమానాలు వినియోగించారన్నారు.
'చిత్రం... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి