ఆంధ్రప్రదేశ్‌

ప్రాంతీయ విభేదాలు సృష్టించడం మంచిది కాదు: అయ్యన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 28: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సూచించారు. మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ ముందుగా రాజధాని అమరావతి రైతులతో మాట్లాడి వారికి ఒక పరిష్కార మార్గం చూపాలన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న పాలన జిల్లాల మధ్య ప్రజలకు విభేదాలు సృష్టించేలా ఉందన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విధానాలను అవలంభిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి విభేదాలు సృష్టించడం సరికాదన్నారు. ప్రతి జిల్లా ప్రజలు తమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని రాష్ట్రం బాగుండాలని భావిస్తారన్నారు.