ఆంధ్రప్రదేశ్‌

టిడ్కో రివర్స్ టెండర్లలో రూ. 30.91 కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ కార్యక్రమాల నిమిత్తం టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో తాజాగా మరో రూ 30.91 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన 5088 యూనిట్ల నిర్మాణాలకు రూ. 306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ. 275.7 కోట్లు ఈ పనులను చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ బిడ్ దాఖలు చేసి ఎల్ 1గా నిలిచిందన్నారు. ఈ ప్యాకేజీలో రూ. 30.91 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో డిడ్కోలో సత్ఫలితాలు సాధించామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇంత వరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ. 3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించగా రూ. 2.847.16 కోట్లతో ఆ పనులను చేపట్టడానికి వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి వివరించారు. ఇలా 12 ప్రాజెక్టుల్లో మొత్తం రూ. 392.23 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయిందన్నారు. వివిధ ప్యాకేజీల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 156 నుంచి రూ. 316 వరకు ఖర్చు తగ్గి ప్రభుత్వంపై భారం తగ్గిందని ఆయన తెలిపారు.
*చిత్రం... పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ