ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎస్ ఎల్వీ సెలవు పొడిగింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 23 February 2020
విజయవాడ, ఫిబ్రవరి 22: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సెలవు పొడిగింపు అభ్యర్థనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2019 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయనను బాపట్లలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఆకస్మిక బదిలీ చేయడం తెలిసిందే. ఆ బాధ్యతలను స్వీకరించకుండా ఆయన గత ఏడాది డిసెంబర్ 6 వరకూ సెలవు పెట్టారు. ఆ తరువాత సెలవును ప్రతి నెలా పొడిగించుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకూ సెలవు పొడిగించాలని చేసిన అభ్యర్థనను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.