ఆంధ్రప్రదేశ్‌

సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 23 : తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అవాస్తవ కథనాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఖండించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ టీటీడీకి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయని అవాస్తవాలను సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఆదివారం తిరుపతిలోని ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.