ఆంధ్రప్రదేశ్
ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లపట్టాలు బోగస్ ప్రచారమే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 February 2020
విజయవాడ, ఫిబ్రవరి 24: రాజధాని అమరావతిలో ఉద్యమకారులకు మద్దతు పలకటానికి వెళ్లిన మహిళా జేఏసీ నేతల్ని దారుణంగా అవమానించి హింసించటం అత్యంత నీచమైన చర్య అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఖండించారు. నగరంలో సోమవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రజాప్రతినిధులను అడిగే హక్కు ప్రజలకుందని, అంతేకాని మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని, ఎంపీ సురేష్ కారు రైతు కాలిమీదుగా ఢీకొంటూ వెళ్లిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంపీ సురేష్ అనుచరులు మహిళలపై చేసిన దౌర్జన్యంపై దిశ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.