ఆంధ్రప్రదేశ్‌

ప్రజల ప్రాణాలకన్నా ఎన్నికలే ముఖ్యమా?: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 21: జాతీయ విపత్తులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానమన్నట్లు ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్య రక్షణ విషయాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి, మంత్రులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు ఎన్నికల అరాచకాలకు పాల్పడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారన్నారు.