ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిని అడ్డుకోవడం మాని మంచి సలహాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: కాంగ్రె స్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడం మాని మంచి సలహాలు ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ (ఎపి) నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు ధర్నా నిర్వహించి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశించి గెలిపించారని ఆయన చెప్పారు. ప్రజలు ఆశించిన విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్, వైకాపా నేతలు జీర్ణించుకోలేక అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి సంతకాల సేకరణ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, జైరాం రమేష్, వీరప్పమొయిలీ, చిదంబరం తదితరులు పార్లమెంటు సభ్యులుగా ఉన్నందున, వారంతా పోడియం వద్ద ప్రధాని మోదీ ముందు ధర్నా నిర్వహించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన డిమాండ్ చేశారు.