ఆంధ్రప్రదేశ్‌

మావోయిస్టు దళ సభ్యుడుసహా ఆరుగురు లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 3: మావోయిస్టు పార్టీకి చెందిన ఓ దళ సభ్యుడుసహా మరో ఆరుగురు మిలీషియా సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో వీరిని హాజరు పరిచి, వివరాలను ఎస్పీ తెలిపారు. జికెవీధి మండలం, దేవరాపల్లి పంచాయితీ, వీరవరవం గ్రామానికి చెందిన మర్రి వీర అలియాస్ లీవు(25) 15ఏళ్ల వయస్సులో తల్లితండ్రులను కోల్పోవడంతో, ఒంటరిగా ఉన్న ఇతనిని చూసి మిలిషీయా కమాండర్ జాంబ్రీ తనతో పాటు 2008లో మావోయిస్టు పార్టీలోకి తీసుకుని వెళ్ళాడు. ఇతని తలపై రూ.లక్ష రివార్డు కూడ ఉంది. పలు రకాల తుపాకులను ఉపయోగించడంలో వీర సిద్ధహస్తుడు.