ఆంధ్రప్రదేశ్‌

పాఠశాలకు వెళ్లలేదని కన్నకూతురు ప్రాణం తీశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి, అక్టోబర్ 7 : పాఠశాలకు వెళ్లలేదనే కారణంతో కన్నతండ్రి తీవ్రం గా కొట్టడంతో ఒక బాలిక మృతిచెందింది. మృతదేహాన్ని రహస్యంగా ఖననంచేసిన ఆ కిరాతకుడు విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని భార్యను కూడా బెదిరించాడు. గత నెల 22వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం రామశింగవరం గ్రామానికి చెందిన యలమర్తి రాజారత్నం, స్వరూపరాణి రామశింగవరంలోని ఒక తోటలో నివాసం ఉంటుటున్నారు. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. రాజారత్నంకు మరో మహిళతో సంబంధంవుంది. ఆమె కూడా వారితోనే నివాసం ఉంటుంది. రాజారత్నం, స్వరూపరాణి దంపతుల కుమార్తె మల్లీశ్వరి లింగపాలెం మండలం రంగాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఈ బాలిక గత నెల 22వ తేదీన పాఠశాలకు వెళ్లలేదు. విషయం తెలిసిన తండ్రి రాజారత్నం బాలికను కొట్టాడు. ఈ సంఘటనలో మల్లీశ్వరి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను సమీపంలోని బాదరాల, అక్కడ నుంచి రంగాపురం తీసుకువెళ్లి ఆర్‌ఎంపికి చూపించారు. ప్రయోజనం లేకపోవడంతో ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే మల్లీశ్వరి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని వెనక్కు తీసుకువచ్చిన తండ్రి ఈ విషయాన్ని గోప్యంగావుంచి, తాను కమతం ఉంటున్న తోటలోనే ఖననం చేశాడు. విషయం బయటకువస్తే చంపేస్తానని భార్యను హెచ్చరించాడు. అయితే కన్నతల్లి మనస్సు తట్టుకోలేక రోదిస్తుండటంతో స్థానికులు ఆరా తీయగా విషయం బయటపడింది. నిందితుడు రాజారత్నం పరారీలో ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.