ఆంధ్రప్రదేశ్
పేదరికం లేని సమాజ స్థాపనే ధ్యేయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 10 October 2016
విజయవాడ, అక్టోబర్ 9: రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దసరా వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మహర్నవమి, మంగళవారం నిర్వహించనున్న విజయదశమి వేడుకలు తెలుగు లోగిళ్లలో నవ్యకాంతులు నింపాలని, అందరి ఆకాంక్షలు నెరవేరాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు. విజయదశమి చెడుపై మంచి గెలుపొందిన సుముహూర్తమని, సత్సంకల్పాలకు నాంది పలికే పండుగ అని చంద్రబాబు అభివర్ణించారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని అభిలషిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి తమకు సమప్రాధాన్యాంశాలని చెప్పారు.