ఆంధ్రప్రదేశ్‌

నూకాంబిక అమ్మవారికి స్వర్ణ కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, అక్టోబర్ 12: ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారికి ఒక కిలో 800 గ్రాముల బంగారు కిరీటాన్ని ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తయారు చేయించామని తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ కిరీటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అలంకరిస్తామన్నారు. ఆలయ గర్భగుడి ద్వారాలకు వెండి తాపడం వేయిస్తామన్నారు. ఆలయం చుట్టూ ఉన్న స్థలాలు కుంకుమ వ్యాపారుల ఆక్రమణలో ఉన్నాయని, నకిలీ కుంకుమ అమ్మడం వలన భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అనకాపల్లిలో ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు రూ. 69కోట్ల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు. అనకాపల్లి పాలిటెక్నిక్ ప్రహరీ నిర్మాణానికి రూ. 1.40 కోట్ల నిధులు విద్యాశాఖ విడుదల చేసిందన్నారు.