ఆంధ్రప్రదేశ్‌

ఏజన్సీ మరణాలపై సమగ్ర విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 13: ఇటీవలి కాలంలో తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీ ప్రాంతంలో సంభవిస్తున్న వరుస మరణాలను ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని, అక్కడి మాతా శిశు మరణాలపై సమగ్రంగా విచారించి, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం వైద్యారోగ్య శాఖాధికారులతో ఏజన్సీ మరణాలపై శివాజీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజన్సీ మరణాలపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. ఏజన్సీ ప్రాంతంలో వైద్య సేవల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.