ఆంధ్రప్రదేశ్‌

మెడికో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 20:పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని ఆశ్రం మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న బలభద్ర రితేష్ (24) అనే యువకుడు గురువారం మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దానవాయిపేటకు చెందిన రితేష్ కొద్దికాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే కళాశాలకు వచ్చిన రితేష్ గురువారం ఉదయానికి ఆసుపత్రి ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుని పడిఉన్నాడు. దీనిని గమనించిన అతని స్నేహితులు యాజమాన్యానికి సమాచారం అందించటంతో వారు అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా రితేష్ తల్లిదండ్రులు వెంకట్రాజు, సుజాత, సోదరుడు రఘువీరు కూడా వైద్యులే. సమాచారం తెలుసుకుని ఆసుపత్రి వద్దకు చేరుకున్న వారు రితేష్ మరణంపై తమకు అనుమానాలు లేవని స్పష్టం చేయటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.