ఆంధ్రప్రదేశ్
‘సింహాద్రి’లో నిలిచిన ఉత్పత్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 October 2016
విశాఖపట్నం (గాజువాక), అక్టోబర్ 28: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) మొదటి ఐదు వందల మెగావాట్ల యూనిట్లో శుక్రవారం మధ్యాహ్నం నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం సింహాద్రిలో 1500 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం రావాడ వద్ద ఎన్టీపీసీ నిర్మించిన సింహాద్రి పవర్ ప్రాజెక్ట్ రెండు వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. అయితే మొదటి 500 మెగావాట్ల యూనిట్కు సంబంధించిన సిఎ ఫ్యాన్లో సాంకేతిక సమస్య ఏర్పడిందని, దీనికారణంగా అధికారులు మొదటి యూనిట్ను షట్డౌన్ చేసినట్లు కార్మిక వర్గాలు తెలిపాయి.