ఆంధ్రప్రదేశ్‌

బలహీనపడిన వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 5: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపి బలహీనపడుతోంది. ఈ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళా ఖాతం నుంచి వాయువ్య బంగాళాఖాతంలోకి శనివారం మారింది. ఇది కోల్‌కత్తాకు ఆగ్నేయంగా 410 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావం వలన కోస్తాలో ఒకటి, రెండు చోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి ఉత్తర దిశగా గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది.