ఆంధ్రప్రదేశ్‌

ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, నవంబర్ 6: ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీలో చోటుచేసుకుంది. మదనపల్లె రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.. మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ బార్లపల్లె సమీపంలోని అప్పయ్యగారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమార్తె యమునకు ఏడేళ్ల కితం పట్టణానికి చెందిన సురేష్‌తో వివాహమైంది. ఏడాది తర్వాత సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యమున కుమారుడితో కలిసి అప్పయ్యగారిపల్లెలో ఉన్న పుట్టింకి వచ్చి ఉంటోంది. ఇటీవల అదే పంచాయతీకి చెందిన సురేంద్రతో యమున ప్రేమలో పడింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే నెలరోజుల కితమే యమునకు రెండవ వివాహం చేసుకునేందుకు పెళ్లిసంబంధం వచ్చింది. వారంరోజులో వివాహం జరిగేలా నిర్ణయించుకున్నారు. ఈ విషయం ప్రియుడు సురేంద్రకు సమాచారం అందించి ఇద్దరుకలసి నెలరోజుల కితమే ఊరు విడిచివెళ్ళిపోయారు. శనివారం రాత్రి సురేంద్ర తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి మాట్లాడారు. ఏమి జరిగిందో.. ఏమో.. ఆదివారం ఉదయం ప్రాంతంలో అప్పయ్యగారిపల్లె శివారులోని గుట్టప్రాంతంలో సురేంద్ర, యమున ఇద్దరు గుళికలమందు సేవించి ఆత్మహత్య చేసుకుని పడివుండటాన్ని గ్రామస్థులు గమనించారు. గ్రామస్థులు మదనపల్లె రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డికి సమాచారం అందించగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసునమోదుచేసి ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.