ఆంధ్రప్రదేశ్‌

నల్లకుబేరులపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 9: దేశంలో నల్లకుబేరుల భరతం పట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని, ఇదొక చారిత్రక సంచలనమని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశంలో పెద్ద ఎత్తున నల్లధనం పెరగడం వల్లనే భారత ప్రభుత్వం 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిందన్నారు. కాకినాడ నగరంలో బుధవారం వీర్రాజు విలేఖర్లతో మాట్లాడారు. 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయటాన్ని తాము సమర్ధిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఆదాయ వెల్లడి పధకాన్ని ప్రవేశపెట్టామని, అప్పట్లోనే పెద్దనోట్లను రద్దు చేస్తామని ప్రథాని నరేంద్రమోదీ చెప్పారని సోము గుర్తు చేశారు.