ఆంధ్రప్రదేశ్‌

విహారంలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోటపల్లిగూడూరు, నవంబర్ 13: విహార యాత్ర విషాదం మిగిల్చింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకెళ్లి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల సమాచారం మేరకు నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట ఇసుకడొంకకు చెందిన కొంతమంది స్నేహితులు ఎస్‌కె నజీమ్ (22), రైల్వేఫీడర్స్ రోడ్డుకు చెందిన ఎస్‌కె ముసావీర్ (22), కనుపర్తిపాడుకు చెందిన బైనమూడి హరిష్ (24), సుబ్రహ్మణ్యం దేవ, ఎస్‌కె, రబ్బాని, ఎస్‌కె పాకల్, గజలతో కలిసి ఆదివారం మైపాడు బీచ్‌కు వచ్చారు. వీరు జనసందోహం లేనిచోట సముద్రం లోపలకెళ్లి గల్లంతయ్యారు. ఇది గమనించిన మత్స్యకారులు వెంటనే వీరిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే విగతజీవులైన నజీమ్, ముసావీర్, హరిష్‌లను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. మిగిలిన నలుగురిని అతికష్టంమీద కాపాడగలిగారు. మృతదేహాలను వెంటనే స్నేహితులు వారి ఇళ్లకు తరలించారు.