ఆంధ్రప్రదేశ్
తిరుమల ఘాట్రోడ్డు వద్ద అడవిలో అగ్నిప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 November 2016
తిరుపతి, నవంబర్ 21: తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి కనుమమార్గంలో 25వ మార్గం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోపల సోమవారం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. తిరుమల నుంచి వాహనాలలో తిరుపతికి వస్తున్న భక్తులు ఈ మంటలను గుర్తించి అలిపిరి టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బందికి తెలియజేశారు. వారు వెంటనే అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది సుమారు 50 మంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను నాలుగైదు గంటలపాటు కష్టపడి మంటలు అదుపు చేయగలిగారు.